<font face="mangal" size="3">పెరుగుతున్న చెల్లింపు మోసాల సందర్భాలు - బహుĸ - ఆర్బిఐ - Reserve Bank of India
పెరుగుతున్న చెల్లింపు మోసాల సందర్భాలు - బహుళ మాధ్యమాల ద్వారా ప్రజల అవగాహన కార్యక్రమాలను మెరుగుపరచడం
ఆర్బిఐ/2019-20/256 జూన్ 22, 2020 అధ్యక్షుడు/కార్యపాలక నిర్దేశకుడు/ముఖ్య కార్య నిర్వాణం అధికారి/ మేడమ్/ప్రియమైన సర్, పెరుగుతున్న చెల్లింపు మోసాల సందర్భాలు - బహుళ మాధ్యమాల ద్వారా ప్రజల అవగాహన కార్యక్రమాలను మెరుగుపరచడం డిజిటల్ లావాదేవీల భద్రత మరియు సురక్షితానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకు తన ఇ-బాట్ (e-BAAT) కార్యక్రమాల ద్వారా అవగాహన మెరుగుపరచడం మరియు డిజిటల్ చెల్లింపు మోడ్లను సురక్షితంగా ఉపయోగించడంపై ప్రచారం నిర్వహించడం, పిన్, ఓటిపి, పాస్వర్డ్లు వంటి క్లిష్టమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటోంది. 2. అయితే ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, డిజిటల్ వినియోగదారులఫై మోసాలు కొనసాగుతూనే వున్నాయి. హెచ్చరిక చేయబడిన వివిధ మోసాల పద్ధతులకు అనగా ముఖ్యమైన చెల్లింపు సమాచారాన్ని బహిర్గతం చేయడానికి వారిని ఆకర్షించడం, సిమ్ కార్డులను ఇచ్చిపుచ్చుకోవడం, సందేశాలు మరియు మెయిల్లలో స్వీకరించిన లింక్లు మొదలైన వాటి గురించి జాగ్రత్త వహించక పోవటం వంటి వాటికి మళ్ళీ మళ్ళీ డిజిటల్ వినియోగదారులు గురికావడం. నిల్వ చేయబడిన క్లిష్టమైన సమాచారాన్ని ప్రాప్యత చేసే నకిలీ అనువర్తనాలను డౌన్లోడ్ చేయడంలో వినియోగదారులు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల, అన్ని చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు మరియు పాల్గొనేవారు- బ్యాంకులు మరియు బ్యాంకింగేతర సంస్థలు - డిజిటల్ భద్రత గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలను కొనసాగించడం మరియు బలోపేతం చేయడం చాలా అవసరం. 3. అన్ని అధీకృత చెల్లింపు వ్యవస్థల నిర్వాహకులు మరియు పాల్గొనేవారు దీని ద్వారా డిజిటల్ చెల్లింపుల యొక్క భద్రమైన మరియు సురక్షితమైన ఉపయోగం గురించి వారి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఎస్ఎంఎస్ లు, ప్రింట్ మరియు దృశ్య మాధ్యమాలలో ప్రకటనలు మొదలైన వాటి ద్వారా లక్ష్యంగా ఉన్న బహుళ భాషా ప్రచారాలను చేపట్టాలని సూచించడమైనది. 4. దయచేసి ప్రాప్తిని తెలియపరచండి. మీ విధేయులు, (పి. వాసుదేవన్) |