<font face="mangal" size="3">అంబరనాథ్ జైహింద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటె - ఆర్బిఐ - Reserve Bank of India
అంబరనాథ్ జైహింద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అంబరనాథ్, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
మే 02, 2023 అంబరనాథ్ జైహింద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అంబరనాథ్, మహారాష్ట్ర పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఏప్రిల్ 26, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “మీ వినియోగదారులను తెలుసుకోండి (KYC)” అనే విషయంపై ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, అంబరనాథ్ జైహింద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అంబరనాథ్, మహారాష్ట్ర (‘బ్యాంక్’) పై ₹2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జరిపిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరము(కరస్పాండెన్స్)ల పరిశీలనలో, మిగతావాటితోపాటు, బ్యాంక్ తన కస్టమర్ ఖాతాల రిస్క్ వర్గీకరణ కాలానుక్రమ సమీక్ష నిర్వహించదానికై ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయడంలో విఫలమైందని వెల్లడించింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆర్బిఐ (RBI) ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరము ను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ(RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ఆదేశాల ఉల్లంఘనం జరిగినంత మేరకు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/166 |