డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
అడ్వాన్సుల మేనేజ్మెంట్ –UCBs’ మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి మార్గానిర్దేశాలు (KYC), 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన సూపర్విజన్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ (SAF) నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా డా. పంజాబరావ్ దేశముఖ్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, అమరావతి, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹5 లక్షలు (ఐదు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ తనిఖీలో భాగంగా రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) SAF నందలి విస్పష్ట నిబంధనలను ఉల్లంఘిస్తు 100% కు పైగా రిస్క్ భారం కలిగిన సరికొత్త రుణాలను అడ్వాన్సులను మంజూరు చేయడం జరిగినది, (ii) నిర్దిష్ట పరిమితికి మించి బుల్లెట్ రేపేమెంట్ పథకం ద్వారా బంగారం రుణాలను మంజూరు చేయడం జరిగినది, (iii) రిస్క్ వర్గీకరణ ఆధారంగా ఖాతాదారుల కాలక్రమ KYC (updation) నవీకరణ చేపట్టలేదు (iv) రిస్క్ వర్గీకరణ ఆధారంగా ఖాతాల కాలక్రమ సమీక్ష నిర్వహించలేదు. (v) అనుమానాస్పద/మోసపూరిత లావాదేవీల గుర్తింపుకు, వాటిని పసిగట్టి తదనుగుణంగా అలర్ట్స్ పొందేందుకు కావాల్సిన సమగ్రమైన, ఖచ్చితమైన సాఫ్టువేరు వ్యవస్థను రూపొందించలేదు. కావున పైన పేర్కొన్న కారణాల రీత్యా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
యోగేష్ దయాల్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన:2023-2024/1760 |