<font face="mangal" size="3">తూర్పు & ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే సహకార బ్యా - ఆర్బిఐ - Reserve Bank of India
తూర్పు & ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్ కతా, పశ్చిమ బెంగాల్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 12/12/2022 తూర్పు & ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్ తూర్పు & ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా, పశ్చిమ బెంగాల్, (i) సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ (SAF) క్రింద జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాలు మరియు (ii) ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-(మీ కస్టమర్ను తెలుసుకోండి (KYC)) డైరెక్షన్, 2016’ నిబంధనలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు/ఉల్లంఘించినందుకు, RBI తన డిసెంబర్ 07, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.1.00 లక్ష (రూ. ఒక లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు. నేపధ్యము బ్యాంక్ యొక్క మార్చి 31, 2020 మరియు మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదికలు మిగతావాటితో కలిపి, సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ (SAF) క్రింద జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాలు మరియు ఖాతాల నష్ట భయ వర్గీకరణ యొక్క కాలానుగుణ సమీక్ష ఆదేశాలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైందని వెల్లడించాయి. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1354 |