<font face="mangal" size="3px">గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమి - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్) పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
డిసెంబర్ 19, 2022 గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డిసెంబర్ 12, 2022 నాటి తమ ఉత్తర్వు ద్వారా ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులకు వర్తించే “చట్టబద్ద నిల్వల నిర్వహణ – నగదు నిల్వల నిష్పత్తి (CRR) మరియు చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (SLR)” విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు, గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్) (‘బ్యాంక్’) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2018 తేదీ నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి RBI నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ మరియు తనిఖీ నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతా వాటితోపాటు, బ్యాంక్ కనీస నగదు నిల్వల నిష్పత్తిని (CRR) నిర్వహించలేదని, తత్ఫలితంగా RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాల ఉల్లంఘన జరిగిందని వెల్లడైంది. దీనికి అనుగుణంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు బ్యాంక్ యిచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1390 |