మహారాష్ట్రలోని నాసిక్, మాలెగావ్లో గల జనతా సహకార బ్యాంకు లిమిటెడ్పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్రలోని నాసిక్, మాలెగావ్లో గల జనతా సహకార బ్యాంకు లిమిటెడ్పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
మహారాష్ట్రలోని నాసిక్, మాలెగావ్లో గల జనతా సహకార బ్యాంకు లిమిటెడ్పై 2024 ఫిబ్రవరి 27 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల(ఐదు లక్షల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘యూఎస్బీల అడ్వాన్స్ల నిర్వహణ’ మరియు ‘యూఎస్బీల ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనల’కు సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో జనతా సహకార బ్యాంకు విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది. 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలను, సంబంధిత ఇతర ఆదేశాలను అనుసరించడంలో విఫలమైనట్లు గుర్తించడంతో, తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ జనతా సహకార బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది. షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని మరియు ఆ తర్వాత అదనపు సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, జనతా సహకార బ్యాంకు లిమిటెడ్పై ద్రవ్య జరిమానా విధించేలా కింద పేర్కొన్న అభియోగాలు వాస్తవమని గుర్తించింది. బ్యాంకు (i) బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద నిర్దేశించిన నియంత్రణా పరిమితికి మించి బంగారు రుణాలను జారీ చేసిందని, (ii) నిర్దేశించిన నియంత్రణా పరిమితికి మించి తన నామినల్ మెంబర్లకు రుణాలు మంజూరు చేసిందని ఆర్.బి.ఐ కనుగొంది. ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.
(యోగేష్ దయాళ్) చీఫ్జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన :2023-2024/2092 |