ది విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ,ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ,ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు
జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) వారిచే, “ఆర్ధిక మోసాలు – వర్గీకరణ,నివేదికల సమర్పణ,మరియు పర్యవేక్షణ’’ పై జారీ చేయబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకుగాను, ది విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 15 జులై, 2024 ద్వారా రు.50,000/(అక్షరాల ఏభై వేల రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది ఈ బ్యాంకు యొక్క 31-03-2023 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా నాబార్డ్ వారు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీ నివేదిక ఆధారంగా నాబార్డ్ ఆదేశాల ఉల్లంఘన మరియు తత్సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పరిగణన లోకి తీసుకుని, సదరు బ్యాంకు పై ఎందుకు ఆర్ధిక జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత విచారణ లో వాదన విన్నమీదట,నాబార్డ్ వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన (ఆర్ధిక మోసాల గురించి,నాబార్డ్ కి నివేదికల సమర్పణలో జాప్యము జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పరమైన జరిమానాను విధించవలసి వచ్చినది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆధిక జరిమానా అడ్డంకి కాదు (పునీత్ పంచోలీ) చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2024-2025/727 |