ది గాండీవి పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్,నవసారి , గుజరాత్ పై - భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది గాండీవి పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్,నవసారి , గుజరాత్ పై - భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
పట్టణ సహకార బ్యాంకులు, ఇతర బ్యాంకులలో పెట్టే డిపాజిట్లపై భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, “పట్టణ సహకార బ్యాంకులలో ఆర్ధిక మోసాలు(ఫ్రాడ్స్)-వాటి పర్యవేక్షణ మరియు సమాచార నివేదన లో వచ్చిన మార్పులు” పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను ఉల్లంఘించి నందులకు, ది గాండీవి పీపుల్స్ సహకార బ్యాంకు లిమిటెడ్,నవసారి, గుజరాత్ పై- భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 01-09-2023 ద్వారా రు.2.00 లక్షల (అక్షరాల ఒక లక్ష ఏభై వేల రూపాయలు మాత్రమె )జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు. (i) విజ్ఞతతో నిర్ణయించ బడిన బ్యాంకుల మధ్య ఉండాల్సిన కౌంటర్ పార్టీ అత్యధిక పరిమితులను ఉల్లంఘించినది(ii)ఆర్ధిక మోసము(ఫ్రాడ్) జరిగిన తరవాత నిర్ణీత గడువు లోపల నివేదిక సమర్పించలేదు. తదనుగుణంగా, పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన 2023-2024/1065 |