గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 31 తో కలిపి చదువదగిన సెక్షన్ 56లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించబడినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు సెక్షన్ 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 18, 2025 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగా, చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా, బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖాతాలు మరియు బ్యాలెన్స్షీట్ను ప్రచురించడంలోనూ మరియు నిర్ణీత గడువులోగా వాటికి సంబంధించిన ప్రతులను ఆర్బీఐ/నాబార్డ్ కి సమర్పించుటలోనూ బ్యాంక్ విఫలమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు. (పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2024-2025/2246 |