గుజరాత్లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గల లింబసి అర్బన్ సహకార బ్యాంకు లిమిటెడ్పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 9 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.25 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సులు’’, ‘‘డైరెక్టర్లకు రుణాలు మరియు అడ్వాన్సు మొదలగునవి – డైరెక్టర్లు ష్యూరిటీ/గ్యారంటర్లుగా స్పష్టీకరణ”వంటి విషయాల్లో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ ద్రవ్య జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో హామీదారుగా ఉన్న బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువుకు బ్యాంకు రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడైంది. దీంతో తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ బ్యాంకుకు ఆర్ బి ఐ షోకాజు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్ బి ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1248 |