తమిళనాడు, పుదుక్కొట్టై గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
తమిళనాడు, పుదుక్కొట్టై గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
తమిళనాడు పుదుక్కొట్టైలో గల పుదుక్కొట్టై సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949(AACS)లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక పరిశీలనలో బ్యాంకు డైరెక్టర్లకు రుణాలను మంజూరు చేసిందని వెల్లడైంది. దీంతో, జారీచేసిన ఆర్ బి ఐ మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసులు ఇచ్చింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్బీఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు పుదుక్కొట్టై సహకార బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1320 |