మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
"పర్యవేక్షక చర్యల చట్రం" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 25-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 2,50,000 (రెండు లక్షల యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2024 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పాటించనట్లు గుర్తించి ఈ విషయంలో సదరు బ్యాంక్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సదరు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ పర్యవేక్షక చర్యల చట్రం జారీచేసిన నిభంధనలను అతిక్రమించి తాజా తనఖా అప్పులను మంజూరు చేసినట్లు నిర్ధారించి సదరు బ్యాంకుపై అపరాధ రుసుమును విధించింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.
(పునీత్ పాంచోలి) పత్రికా విడుదలी: 2024-2025/302 |