<font face="mangal" size="3">పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ ĸ - ఆర్బిఐ - Reserve Bank of India
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు సొమ్ము ఉపసంహరణ పరిమితి రిజర్వ్ బ్యాంక్, రూ. 25, 000 వరకు పెంచినది
తేది: 03/10/2019 పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు సొమ్ము ఉపసంహరణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., డిపాజిటర్లకు వారి ఖాతాలలోని మొత్తం నిల్వనుండి సొమ్ము ఉపసంహరణపై (విత్డ్రావల్) రూ. 10,000/- (రూపాయిలు పదివేలు) పరిమితి విధించిన విషయం మీకు తెలిసినదే. రిజర్వ్ బ్యాంక్, డిపాజిటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందినుండి మరికొంత ఊరట కల్గించడానికి, బ్యాంకుయొక్క లిక్విడిటీ పరిస్థితిని మరొకసారి సమీక్షించి, ఉపసంహరణ పరిమితి రూ. 25,000/- కు (ఇరవై ఐదు వేల రూపాయిలు) పెంచవలెనని నిశ్చయించింది. పైన తెలిపిన సడలింపు కారణంగా, 70%నికి మించి డిపాజిటర్లు, వారి ఖాతాలోగల మొత్తం నిల్వ తిరిగి తీసుకోగలుగుతారు. బ్యాంక్ ఆర్థిక స్థితిని, రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. డిపాజిటర్ల సంక్షేమంకొరకు అవసరమైన చర్యలన్నీ, రిజర్వ్ బ్యాంక్ తీసుకొంటుంది. ఇంతేగాక, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 36AAA(5)(A) (సెక్షన్ 56 తో కలిపి), క్రింద, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కార్యనిర్వాకుడికి (అడ్మినిస్ట్రేటర్) సహాయంగా, ముగ్గురు సభ్యులుగల కమిటీని నియమించాలని నిశ్చయించింది. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/861 |