<font face="mangal" size="3">ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫై భార - ఆర్బిఐ - Reserve Bank of India
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
మార్చ్ 09, 2018 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేసిన 'చెల్లింపుల బ్యాంక్స్ కోసం ఆపరేటింగ్ మార్గదర్శకాలు' మరియు ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC) నిబంధనలపై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలు పాటించనందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫై మార్చ్ 07, 2018 న రూ. 50 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, ఆర్బిఐ జారీ చేసిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది. ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు పాటించనందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు. నేపథ్యం వినియోగదారుల యొక్క స్పష్టమైన/నిర్దిష్ట సమ్మతి లేకుండా బ్యాంక్ కస్టమర్ ఖాతాలను తెరిచిందని ఫిర్యాదులు మరియు ప్రతికూల మీడియా నివేదికల ఆధారంగా, నవంబరు 20 మరియు 22, 2017 మధ్య, ఆర్బిఐ ద్వారా బ్యాంకు ఫై పర్యవేక్షణా పర్యటన జరిగింది. పర్యవేక్షణా పర్యటన నివేదిక మరియు ఇతర సంబంధిత పత్రాలు, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేసిన 'చెల్లింపుల బ్యాంక్స్ కోసం ఆపరేటింగ్ మార్గదర్శకాలు' మరియు ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC) నిబంధనలను బ్యాంకు పాటించనట్లు తెలియపరిచాయి. ప్రాప్తించిన సమాచారం/దస్తావేజుల ఆధారంగా, విధించిన షరతులను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు జనవరి 15, 2018 న నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2410 |