<font face="mangal" size="3">నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం భా - ఆర్బిఐ - Reserve Bank of India
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం భారతీయ రిజర్వు బ్యాంకు
ఆంబుడ్స్మన్ పథకాన్ని ప్రవేశపెట్టింది
ఫిబ్రవరి 23, 2018 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం భారతీయ రిజర్వు బ్యాంకు ఫిబ్రవరి 7, 2018 నాటి ద్రవ్య విధాన ప్రకటనలో ప్రకటించిన విధంగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), ఫిబ్రవరి 23, 2018 నాటి నోటిఫికేషన్ ద్వారా, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA ప్రకారం, ఈ పథకం క్రింద వున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs) కోసం ప్రవేశపెట్టిన ఆంబుడ్స్మన్ పథకాన్ని నేడు ప్రారంభించింది. వ్యయ-రహిత మరియు వేగవంతమైన ఫిర్యాదు పరిష్కార విధానాన్ని ఈ పథకం అందిస్తుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ఆంబుడ్స్మన్ కార్యాలయాలు నాలుగు మెట్రో సెంటర్లలో, అనగా చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ లో సంబంధిత మండల వినియోగదారుల ఫిర్యాదులను చేపడతాయి. ముందుగా, డిపాజిట్ తీసుకునే అన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి ఫిర్యాదులు స్వీకరించబడతాయి, తరువాత అనుభవం ఆధారంగా, క్రమంగా ఒక రూ. బిలియన్ కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి, వినియోగదారుని ఇంటర్ఫేస్ తో ఫిర్యాదులు స్వీకరించబడతాయి. ఈ పధకం యొక్క అప్పీలేట్ విధానం క్రింద, ఆంబుడ్స్మన్ నిర్ణయం ఫై అప్పీలేట్ అథారిటీకి, ఫిర్యాదుదారు/ఎన్బిఎఫ్సికి అప్పీల్ చేసుకునే వీలు వుంది. ఆర్బిఐ వెబ్సైట్లో పూర్తి పథకం అందుబాటులో ఉంది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2289 |